Andhra Pradesh

పహల్గాం ఉగ్రదాడి: విశాఖ మహిళపై ఉగ్రవాదుల కాల్పులు – దుర్మరణం

మంగళవారం జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో విశాఖపట్నానికి చెందిన రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి చంద్రమౌళి దుర్మరణం పాలయ్యారు. పారిపోతున్న ఆయనను ఉగ్రవాదులు వెంటాడి కాల్చిచంపినట్లు సమాచారం. "చంపొద్దు" అని ప్రార్థించినా, ఉగ్రదళాలు ఈ ఘాతుకానికి పాల్పడ్డాయని తెలుస్తోంది. అనంతరం చంద్రమౌళి మృతదేహాన్ని ఆయనతో వచ్చిన ఇతర పర్యాటకులు గుర్తించారు.

ఈ విషాదవార్త తెలుసుకున్న వెంటనే విశాఖ నుంచి ఆయన కుటుంబ సభ్యులు పహల్గాం వైపు బయలుదేరి వెళ్లారు. ఈ దాడిలో మొత్తం 28 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయినట్లు, మరో 20 మందికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం అందుతోంది.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens