టాలీవుడ్ డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ చాలా కాలం తర్వాత తెరకెక్కించిన సినిమా 'జాక్'. డీజే టిల్లు ఫేమ్ సిద్దు జొన్నలగడ్డ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య కథానాయికగా నటించింది. స్పై యాక్షన్ డ్రామాగా రూపొందించిన ఈ మూవీ విడుదలకు ముందు నుంచే క్యూరియాసిటీని కలిగించింది.
యంగ్ హీరో సిద్దు జొన్నల గడ్డ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైనప్ చేసి బిజీగా మారిపోయాడు. కెరీర్ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రలు చేసి పాపులర్ అయ్యాడు సిద్దు. ఆ తర్వాత హీరోగా మారి సినిమాలు చేస్తున్నాడు. డీజే టిల్లు సినిమాతో ఓవర్ నైట్లో స్టార్గా మారిపోయాడు ఈ కుర్ర హీరో. ఇక ‘డీజే టిల్లు’ సినిమాతో యువతలో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ‘డీజే టిల్లు’ సినిమా తర్వాత ‘టిల్లు స్క్వేర్’ సినిమాతో మరో హిట్ అందుకున్నాడు. చివరగా ‘జాక్’ కొంచం క్రాక్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదల అయ్యింది.
‘జాక్’ సినిమాకు మంచి ప్రమోషన్స్ నిర్వహించారు. ‘టిల్లు స్క్వేర్’ సినిమా తర్వాత వచ్చిన సినిమాగా ఈ సినిమా పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. కానీ సినిమా విడుదలైన తర్వాత పరిస్థితి కాస్త భిన్నంగా ఉంది. ఈ సినిమాలో సిద్దుకి జోడీగా వైష్ణవి చైతన్య హీరోయిన్గా నటించింది. అగ్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్పై బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, నరేష్, బ్రహ్మాజీ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం ఏప్రిల్ 10న గ్రాండ్గా విడుదలైంది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 'జాక్' సినిమాలో సిద్దు తన నటనతో ఆకట్టుకున్నాడు. త్వరలో ఈ సినిమా ఓటీటీలో విడుదల కానుందని సమాచారం. ‘జాక్’ సినిమా తెలుగుతో పాటు మలయాళం, తమిళం, కన్నడ, హిందీ భాషలలో కూడా విడుదల అవుతుందని చెబుతున్నారు. మే 1న 'జాక్' సినిమా ఓటీటీలో రాబోతుందని టాక్ వినిపిస్తుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ ఈ సినిమాను ఓటీటీకి విడుదల చేయనున్నారని సమాచారం.