సెలవుల సంస్కృతిపై వ్యాఖ్యలు చేసిన హైదరాబాద్ సీఈవో రవికుమార్ టుమ్మలచెర్లపై తీవ్ర విమర్శలు

పని గంటలు Vs సెలవులు: హైదరాబాద్ సీఈవో వ్యాఖ్యలు కలకలం

ప్రస్తుతం దేశవ్యాప్తంగా పని గంటల పై చర్చ జరుగుతున్న నేపథ్యంలో, హైదరాబాద్‌కు చెందిన ‘క్లీన్ రూమ్స్ కంటైన్‌మెంట్’ సీఈవో రవికుమార్ తుమ్మలచర్ల చేసిన వ్యాఖ్యలు కొత్త దిశలో చర్చకు తెరలేపాయి. తన లింక్డిన్ పోస్ట్ ద్వారా రవికుమార్, “ఏప్రిల్ నెలలో పదికి పైగా సెలవులు రావడం వల్ల కార్యాలయాల్లో ఫైళ్ల ముందుకు కదలడం లేదు, పనులు ఆగిపోతున్నాయి” అని ఆవేదన వ్యక్తం చేశారు.

అంతేకాదు, చైనాతో భారతదేశాన్ని పోల్చుతూ, "చైనా మనకంటే 60 ఏళ్లు ముందుంది, అక్కడ అభివృద్ధికి గణనీయమైన ప్రాధాన్యత ఉంది" అంటూ వ్యాఖ్యానించారు. భారతదేశంలో సెలవుల సంస్కృతి పునఃపరిశీలనకు అవసరం ఉందని అభిప్రాయపడి, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరియు కేంద్ర కార్మికశాఖ మంత్రికి విజ్ఞప్తి కూడా చేశారు.

ఇతరుల అభిప్రాయాలు:

  • “మనం యంత్రాలమా? ఇది మన జీవనశైలి కాదు” అంటూ పలువురు నెటిజన్లు తిరుగుబాటు తెలిపారు.

  • “చైనా లాంటి నియంత్రిత వ్యవస్థలతో మన సాంఘిక, రాజకీయ వ్యవస్థను పోల్చడం తగదు” అనే అభిప్రాయం పలువురు వ్యక్తం చేశారు.

  • మరికొందరు రవికుమార్‌ అభిప్రాయానికి మద్దతు తెలియజేస్తూ, “ప్రొడక్టివిటీ తగ్గుతుంది, పరిశీలన అవసరం” అన్నారు.

ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో, పని – వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యతపై దేశవ్యాప్తంగా చర్చ కొనసాగుతోంది.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens