ఐపీఎస్ అధికారి, ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్
పీఎస్ఆర్ ఆంజనేయులు, ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్, ముంబై నటి జెత్వానీకి వేధింపుల కేసులో అరెస్ట్ అయ్యారు. ఏపీ సీఐడీ అధికారులు ఆయన్ను హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఆయన్ను పూర్తిస్థాయిలో విచారించనున్నట్లు సీఐడీ అధికారులు తెలిపారు. విచారణ అనంతరం ఆయన్ను హైదరాబాద్ నుండి ఆంధ్రప్రదేశ్కి తరలిస్తున్నారు.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పీఎస్ఆర్ ఆంజనేయులు ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేశారని తెలిసిందే. ప్రస్తుతం ఆయన్ని సస్పెన్షన్లో ఉంచారు.