MS ధోనీ: పంత్ సోదరి వివాహ వేడుకలో రైనాతో కలిసి చిందేసిన ధోనీ – వీడియో చూడండి!
ఇండియన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ MS ధోనీ, మాజీ ఆటగాడు సురేశ్ రైనా కలిసి, పంత్ సోదరి సాక్షి వివాహ వేడుకలో బాలీవుడ్ పాట "డమా డామ్ మస్త్ కలందర్"పై డ్యాన్స్ చేశారు. ఆ డ్యాన్స్ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
పంత్ సోదరి సాక్షి, వ్యాపారవేత్త అంకిత్ చౌధరీతో వివాహం చేసుకుంది. ఈ వేడుక ముస్సోరీలోని సవాయ్ హోటల్లో బుధవారం జరిగింది. ఈ వివాహానికి MS ధోనీ, రైనా హాజరయ్యారు.
ధోనీ తన భార్య సాక్షితో మంగళవారం సాయంత్రం ముస్సోరీ చేరుకున్నారు. పెళ్లి వేడుకలో ధోనీ, రైనా ఎంతో అలరించి, పంత్తో కలిసి "డమా డామ్ మస్త్ కలందర్" పాటపై డ్యాన్స్ చేశారు. ఆ వీడియో నెట్టింట షేర్ అయ్యి వైరల్ అయింది.
రీసెంట్గా పంత్ ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొన్నాడు, కానీ ఒక మ్యాచ్ కూడా ఆడేందుకు అవకాశం రాలేదు. టోర్నీ ముగించాక, అతడు ఇండియాకు తిరిగి వచ్చి, సోదరి వివాహ వేడుకలలో పాల్గొన్నాడు.
ప్రస్తుతం, పంత్ ఐపీఎల్ 2025 కోసం సిద్ధమవుతున్నాడు. నవంబర్లో జెడ్డాలో జరిగిన మెగా వేలంలో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) రూ.27 కోట్లకు పంత్ను కొనుగోలు చేసింది. ఈ డీల్తో అతడు ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. అదేవిధంగా, లక్నో జట్టు పగ్గాలు కూడా పంత్కు అప్పగించబడ్డాయి.