11కోట్లతో ఏకశిలా గణపతి ఆలయం

వెయ్యి ఏళ్ల చరిత్ర గలిగిన... తెలంగాణ రాష్ట్రంలోని, నాగర్ కర్నూల్ జిల్లా, తిమ్మాజిపేట మండలంలోని ఆవంచ గ్రామంలో కొలువైన చాళుక్యుల కాలం నాటి ఏకశిల గణపతికి(ఐశ్యర్య గణపతి) శాశ్వత ఆలయం కట్టిస్తున్నట్లు స్థానిక ఎమ్మెల్యే.. 10ఏళ్ల ప్రజా ప్రస్థాన యాత్రలో భాగంగా ఓ సభలో మర్రి జనార్ధన్ రెడ్డి ప్రకటించారు. మాజీ మంత్రి, ఆవంచ గ్రామానికి చెందిన లక్ష్మారెడ్డితో కలిసి కేసిఆర్ తో మాట్లాడినట్లు ప్రకటించారు. కొన్ని రోజుల్లో నిధుల విడుదల అవుతాయని తెలియజేశాడు.
మీ అందరికీ మా ధన్యవాదాలు:
గణపతి చతుర్థి సందర్భంగా... ఆవంచ గణపతిపై మనవాయిస్ మీడియాలో ఓ కథనం వేశాం. అది బాగా వైరల్ అయింది. స్థానిక ప్రాంతం నాగర్ కర్నూల్ జిల్లాలో వైరల్ అయింది. మా చీఫ్ ఎడిటర్ మేరే శంకర్, స్థానికుల సహాయంతో చేసిన... ఈ కథనంపై మీ స్పందన అమూల్యం. ఇప్పటి వరకు మేము కాలగర్భంలో కలిసిపోతున్న అనేక చారిత్రక కట్టడాలు, దేవాలయాలు, కోటలు, మరెన్నో వాటిని ప్రతి శనివారం మీ ముందుకు తీసుకువస్తున్నాము. ఈరోజు మా కష్టానికి ప్రతిఫలం లభించింది. మాకు చాలా ఆనందం కలిగింది ఈ వార్త విన్నాక. మీ అభిమానాలు/స్పందన ఇలాగే ఉండాలని కోరుకుంటూ... మరిన్ని చారిత్రక కట్టడాలు మీ ముందుకు తీసుకువస్తాం.
అలాగే ఆవంచ గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
ఇట్లు
మనవాయిస్ గ్లోబల్ మీడియా
చీఫ్ ఎడిటర్
మేరే శంకర్.


Today's Best Deals

64% OFF

Women Fashion

60% OFF

Men Fashion

56% OFF

Kids Fashion

21% OFF

Mobiles and Tablets