orts

IPLలో రెండో వేగవంతమైన సెంచరీ... 14ఏళ్ల వైభవ్ సూర్యవంశి చరిత్ర సృష్టించాడు

IPL 2025లో చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశి

IPL చరిత్రలో అసాధారణ ఘట్టంగా, రాజస్థాన్ రాయల్స్ తరపున 14ఏళ్ల వైభవ్ సూర్యవంశి 35 బంతుల్లో సెంచరీ నమోదు చేశాడు. ఈ మ్యాచ్ జైపూర్‌లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో జరిగింది. ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 209 పరుగులు చేశారు. లక్ష్య ఛేదనలో వైభవ్ మొదటి నుంచి ఆగ్రెసివ్‌గా ఆడి, 17 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు.

చిన్న వయస్సులో సెంచరీ – IPLలో రెండో వేగవంతమైనది

వైభవ్, గుజరాత్ బౌలర్ కరిమ్ జానత్ ఓ ఓవర్‌లో 30 పరుగులు సాధించాడు. మూడు ఫోర్లు, మూడు సిక్సర్లు కొట్టి వేగంగా స్కోరు పెంచాడు. కేవలం 35 బంతుల్లో సెంచరీ పూర్తి చేసి IPL చరిత్రలో రెండో వేగవంతమైన సెంచరీ చేసిన ఆటగాడిగా నిలిచాడు. మొత్తం 38 బంతుల్లో 101 పరుగులు చేశాడు, ఇందులో 7 ఫోర్లు మరియు 11 సిక్సర్లు ఉన్నాయి. తర్వాత ప్రసిద్ కృష్ణ వేసిన బంతికి అవుటయ్యాడు.

రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం సాధించింది

రాజస్థాన్ రాయల్స్ 210 పరుగుల లక్ష్యాన్ని కేవలం 15.5 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. వైభవ్ 101 పరుగులు, యశస్వి జైస్వాల్ 70 పరుగులు, కెప్టెన్ రియాన్ పరాగ్ నాటౌట్ 32 పరుగులు చేశారు. ప్రత్యేకంగా వైభవ్ మరియు యశస్వి జైస్వాల్ మధ్య 166 పరుగుల ఓపెనింగ్ పార్టనర్‌షిప్ హైలైట్‌గా నిలిచింది. గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ కృష్ణ, రషీద్ ఖాన్ తలా ఒక వికెట్ తీశారు.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens