siness

ఆనంద్ మహీంద్రా: టెస్లా భారత్‌లోకి వస్తే పోటీని ఎలా ఎదుర్కొంటారు? ఇదే ఆనంద్ మహీంద్రా సమాధానం

టెస్లా భారత మార్కెట్‌లోకి వస్తే ఆ పోటీని ఎలా తట్టుకుంటారని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు భారత పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఆసక్తికర సమాధానం ఇచ్చారు. ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా భారత్‌లోకి ఆరంగేట్రం చేయనున్నట్లు సంకేతాలు ఇచ్చిన నేపథ్యంలో ఈ ప్రశ్న వచ్చింది.

1991లో ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత కూడా ఇలాంటి ప్రశ్నలు ఎదురైనాయని, అప్పుడు టాటా, సుజుకీ వంటి కంపెనీలతో పోటీ చేయాల్సి వచ్చిందని ఆయన గుర్తు చేసుకున్నారు. ఆ పోటీలో నిలబడటానికి మహీంద్రా ఉత్పత్తులపై ఉన్న నమ్మకమే కారణమని ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు. టెస్లా వచ్చినా, మహీంద్రా అదే నమ్మకంతో ముందుకు సాగుతుందని ఆయన చెప్పారు.

భారత వినియోగదారులు, ప్రజలు ఇస్తున్న మద్దతుతో పోటీకి అనుగుణంగా తమను తాము మార్చుకుంటామని తెలిపారు. 2018లో ఎలాన్ మస్క్ సంస్థలు కష్టాల్లో ఉన్నప్పుడు మద్దతు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ, ఇప్పటికీ అదే మద్దతు ఉంటుందని ఆయన అన్నారు.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens