వైసీపీ నేత, మాజీ మంత్రి రోజా కూటమి ప్రభుత్వంపై విమర్శలతో మళ్లీ దుమారం రేపారు. రాష్ట్రంలో వైద్య కళాశాలలకు మంగళం పాడేసినట్లుగా, రైతు భరోసా కేంద్రాలను కూడా తొలగిస్తుండడం, ఇప్పుడు పాఠశాలలపై దృష్టి పెట్టడమేంటని ఆమె ఆరోపించారు. "మీరు ముందే చెప్పినట్లుగా, విద్య ప్రభుత్వ బాధ్యత కాదని మీరు అంటున్నారు, కాబట్టి తప్పు మీది కాదు, తప్పంతా ఈవీఎంలదే" అని ఆమె ఎద్దేవా చేశారు.
"ఐదు కిలోమీటర్ల పరిధిలో గ్రామంలో ఒకే పాఠశాల ఉండాలా...? గ్రామంలో ఎన్ని బ్రాందీ షాపులైనా, ఎన్ని బెల్ట్ షాపులైనా ఉండొచ్చా...? బాగుందయ్యా బాగుంది అని ఊరంతా గుసగుసలాడుకుంటున్నారని తెలుస్తోంది" అంటూ రోజా సోషల్ మీడియాలో స్పందించారు.