Andhra Pradesh

సాయిదుర్గా తేజ్: రాజకీయాలపై స్పందించిన సాయి దుర్గా తేజ్.. ఏమన్నారు?

సాయి దుర్గా తేజ్: అహోబిలం దర్శనం, రాజకీయ ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు

మెగా హీరో సాయి దుర్గా తేజ్ ప్రస్తుతం "సంబరాల ఏటిగట్టు" సినిమాలో నటిస్తున్నారు. బుధవారం ఆయన ఆళ్లగడ్డలోని ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. ఆలయ వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. స్వామివారి దర్శనంతో ఎంతో ఆనందంగా ఉందని సాయి దుర్గా తేజ్ మీడియాతో వెల్లడించారు.

సినిమా విషయాలపై మాట్లాడుతూ, "సంబరాల ఏటిగట్టు" సినిమా కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నానని, త్వరలో కొత్త అప్డేట్స్ అందిస్తానన్నారు. హెల్మెట్ ధరించడం యువతకు ఎంత ముఖ్యమో గుర్తు చేశారు. రాజకీయాల గురించి మాట్లాడుతూ, తనకు రాజకీయాల్లో ఎటువంటి ఆసక్తి లేదని, అది చెప్పడం ఈజీ అయినా చేయడం చాలా కష్టం అని అన్నారు. చిరంజీవితో కలిసి నటించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నానని చెప్పిన సాయి దుర్గా తేజ్, తనకు సహకరించిన ఆలయ సిబ్బందికి, అభిమానులకు, జనసేన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens