గుంటూరు మిర్చి యార్డులో జగన్ పర్యటనపై కేసు
ఎమ్మెల్సీ కోడ్ అమల్లో ఉన్నా పర్యటనకు వచ్చారంటూ కేసు నమోదైంది. వైసీపీ అధినేత జగన్ ఇవాళ గుంటూరు మిర్చి యార్డులో పర్యటించడంపై నల్లపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యింది.
వైసీపీ నేతలపై కూడా కేసు నమోదు
ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో, ఎన్నికల కమిషన్ (ఈసీ) మరియు జిల్లా కలెక్టర్ ముందస్తుగా సూచించినప్పటికీ, జగన్ మిర్చి యార్డుకు వెళ్లారు. దీనిపై నల్లపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయబడింది. ఈసీ మరియు జిల్లా ఎన్నికల అధికారి ఆదేశాలను లెక్కచేయకుండా మిర్చి యార్డులో కార్యక్రమం నిర్వహించారని ఆరోపణలతో జగన్తో పాటు వైసీపీ నేతలు అంబటి రాంబాబు, కొడాలి నాని, లేళ్ల అప్పిరెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, నందిగం సురేశ్ తదితరులపై కూడా కేసు నమోదైంది.