ఏపీ SSC 10వ తరగతి పరీక్షలు 2025 ప్రారంభం, 6.19 లక్షల మంది విద్యార్థులు పాల్గొననున్నరు

ఏపీ SSC 10వ తరగతి పరీక్షలు 2025 ప్రారంభం: 6.19 లక్షల మంది విద్యార్థులు హాజరు

ఆంధ్రప్రదేశ్ SSC (10వ తరగతి) బోర్డు పరీక్షలు 2025 నేడు ప్రారంభమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 3,450 పరీక్షా కేంద్రాలలో 6,19,275 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. పరీక్షలు సజావుగా కొనసాగేందుకు ప్రధాన కార్యదర్శి (CS) జిల్లా కలెక్టర్లు, పోలీస్ సూపరింటెండెంట్స్ (SPs)కు కఠిన ఆదేశాలు జారీ చేశారు.

పరీక్షా కేంద్రాలలో చీఫ్ సూపరింటెండెంట్‌కి మాత్రమే మొబైల్ ఫోన్ అనుమతి ఇవ్వబడింది. జిల్లా కలెక్టర్లు, SPs విద్యా శాఖ అధికారులతో సమావేశాలు నిర్వహించి సమన్వయం చేసుకోవాలని సూచించారు. ప్రధాన కార్యదర్శి విజయన్ ఈ పరీక్షల నిర్వహణకు అత్యంత ప్రాముఖ్యత ఉన్నట్టు పేర్కొని, ఎటువంటి సమస్యలు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ పరీక్షలు ఏప్రిల్ 1 వరకు కొనసాగనున్నాయి.

ఆంధ్రప్రదేశ్ మాధ్యమిక విద్యా మండలి (BSEAP) మార్చి 3న హాల్ టికెట్లు విడుదల చేసింది. విద్యార్థులు వాటిని అధికారిక వెబ్‌సైట్ (bse.ap.gov.in) ద్వారా లేదా మన మిత్ర, ఏపీ ప్రభుత్వ వాట్సాప్ సేవ (9552300009) ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. గతేడాది 6,16,615 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. మొత్తం 86.69% ఉత్తీర్ణత శాతం నమోదైంది. పర్వతీపురం మన్యం జిల్లా 96.37% ఉత్తీర్ణతతో మొదటి స్థానంలో ఉండగా, కర్నూలు 62.47% ఉత్తీర్ణతతో చివరిస్థానంలో నిలిచింది.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens